కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మోదీ వరం

- September 08, 2016 , by Maagulf
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మోదీ వరం

 జమ్మూ-కశ్మీరులో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు పర్యటనకు విమానాల్లో వెళ్ళే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు సెలవు కాలపు ప్రయాణ రాయితీ (ఎల్‌టీసీ)ని వర్తింపజేయాలని నిర్ణయించింది. రెండేళ్ళపాటు ఈ రాయితీని వర్తింపజేయనున్నట్లు గురువారం పేర్కొంది. ఏ విమానయాన సంస్థకు చెందిన విమానంలోనైనా ప్రయాణించవచ్చునని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com