పైరసీ సమస్య ఇండస్ట్రీలకు ప్రధాన శత్రువు : సిద్ధార్థ్
- September 08, 2016
భారత్ లో అన్ని సినీ ఇండస్ట్రీలను ఒకే సమస్య పట్టి పీడిస్తుందని టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ అంటున్నాడు. సినీ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూనే తగిన సూచనలు ఇచ్చాడు. పైరసీ సమస్య ఇండస్ట్రీలకు ప్రధాన శత్రువు అని, దాంతో పాటు అసంబద్దమైన సినిమా విశ్లేషణ(రివ్యూ)లు సినిమాలను మార్కెట్ పరంగా దారుణంగా దెబ్బతీస్తున్నాయని వరుస ట్వీట్లు చేశాడు. సినిమా చేయాలంటేనే ఆసక్తి రావడం లేదని, వాటిపై గౌరవం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.సినిమా చూసిన వాళ్లు సాధ్యమైనంత త్వరగా విమర్శించడం జరుగుతుంటుందని, అలాంటివి కామన్ అయ్యాయని పేర్కొన్నాడు. కానీ, సినిమా చూస్తూనే లైవ్ ట్వీట్లు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రేక్షకులను సిద్ధార్థ్ ప్రశ్నించాడు.వాస్తవానికి మూవీ చూస్తూ ట్వీట్ చేస్తుంటే.. మీరు ఫోన్ ను చూస్తారా.. లేక తెరపై మూవీ చూస్తారా.. ఇలా ఒకేసారి బ్రెయిన్ రెండు పనులు చేయడం సాధ్యం కాదంటున్నాడు. హాల్లో ఉన్నప్పుడు మూవీ చూడటం కరెక్టా..? లేకపోతే స్టుపిడ్ ఫోన్ పై మనసు పెట్టాలా అనేది మీరు నిర్ణయించుకోవాలని హీరో సిద్ధార్థ తన అసహనాన్ని వెల్లగక్కాడు. ఫోన్లలో మూవీలు చూస్తే ఏదో రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సూచించాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







