గల్ఫ్ ఎయిర్కి ప్రతిష్టాత్మక అవార్డ్
- September 08, 2016
మనామా: గల్ఫ్ ఎయిర్ తాజాగా బెస్ట్ ఐటీ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అవార్డ్ని సొంతం చేసుకుంది. సెక్యూరిటీ ఎడ్వైజర్ మిడిల్ ఈస్ట్ ఈవెంట్లో ఈ అవార్డ్ దక్కింది. సిపిఐ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో దుబాయ్లోని అల్ హబతూర్ గ్రాండ్ హోటల్లో ఈ వెంట్ జరిగింది. సెక్యూరిటీ డెసిషన్ మేకర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ మిడిల్ ఈస్ట్ కంపెనీల నుంచి పలువురు ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవార్డ్ గల్ఫ్ ఎయిర్కి ఏడవది. ఎయిర్లైన్స్ సంస్థ తరఫున గల్ఫ్ ఎయిర్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ జసిమ్ హాజి ఈ అవార్డ్ని అందుకున్నారు. 2015లో గల్ఫ్ ఎయిర్ ప్రపంచంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన తొలి ఎయిర్లైన్ సంస్థగా అవతరించింది. క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్ విభాగాల్లో చూపిన ప్రత్యేకత నేపథ్యంలో ఈ గౌరవం దక్కించుకుంది గల్ఫ్ ఎయిర్. అలాగే గల్ఫ్ ఎయిర్లైన్, కంప్యూటర్ న్యూజ్ మీడియా ఈస్ట్ సిఐఓ 100 అవార్డ్స్ని నాలుగోసారి వరుసగా అందుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







