ఆఫ్గాన్ పేలుళ్ళను ఖండించిన బహ్రెయిన్
- September 08, 2016
మనామా: ఆఫ్గనిస్తాన్లోని కాబూల్లో ఇటీవల సంభవించిన బాంబు పేలుళ్ళను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదులు బాంబు పేలుళ్ళతో కాబూల్పై విరుచుకుపడ్డ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బహ్రెయిన్ తీవ్రంగా స్పందించింది. ఆప్ఘనిస్తాన్కి తమ నుంచి నైతిక మద్దతు ఎప్పుడూ వుంటుందని ఈ సందర్భంగా బహ్రెయిన్, సందేశం పంపింది ఆఫ్ఘనిస్తాన్కి. తీవ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని, అంతర్జాతీయ వేదికలపై తామూ తీవ్రవాదాన్ని ఖండిస్తూనే ఉన్నామని బహ్రెయిన్ పేర్కొంది. తీవ్రవాదం మానవాళికి పెను శాపంగా మారిందని బహ్రెయిన్ నాయకత్వం అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







