ఈద్ సందర్భంగా 10 రోజులపాటు ఉచిత వైఫై
- September 08, 2016
ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈ అంతటా పది రోజులపాటు ఉచిత వైఫైని అందిస్తున్నట్లు ఎటిసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ వైఫైని మాల్స్లోనూ, రెస్టారెంట్స్లోనూ, కేఫ్లు తదితర ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఎటిసలాట్ సంస్థ అందించనుంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. దేశంలోని 300 పబ్లిక్ లొకేషన్లలో అత్యంత వేగంతో మొబైల్ ఫోన్లకు వైఫై సౌకర్యాన్ని అందిస్తారు. ఎటిసలాట్ చీఫ్ కస్టమర్ ఆఫర్ కాలెద్ ఎక్కౌలీ మాట్లాడుతూ, ఫెస్టివ్ స్పిరిట్తో వినియోగదారులతో కలిసి ఈద్ అలా సంబరాల్లో ఆము కూడా భాగం పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా వినియోగదారులకు పిన్ నెంబర్ని ఎస్ఎంఎస్ చేస్తారు. మొబైల్ నెంబర్ని లాగిన్ ఐడీగానూ, పిన్ నెంబర్ని పాస్వర్డ్గానూ వినియోగించుకుని ఉచిత వైఫైని యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









