ఈద్ సందర్భంగా 10 రోజులపాటు ఉచిత వైఫై
- September 08, 2016
ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈ అంతటా పది రోజులపాటు ఉచిత వైఫైని అందిస్తున్నట్లు ఎటిసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ వైఫైని మాల్స్లోనూ, రెస్టారెంట్స్లోనూ, కేఫ్లు తదితర ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఎటిసలాట్ సంస్థ అందించనుంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. దేశంలోని 300 పబ్లిక్ లొకేషన్లలో అత్యంత వేగంతో మొబైల్ ఫోన్లకు వైఫై సౌకర్యాన్ని అందిస్తారు. ఎటిసలాట్ చీఫ్ కస్టమర్ ఆఫర్ కాలెద్ ఎక్కౌలీ మాట్లాడుతూ, ఫెస్టివ్ స్పిరిట్తో వినియోగదారులతో కలిసి ఈద్ అలా సంబరాల్లో ఆము కూడా భాగం పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా వినియోగదారులకు పిన్ నెంబర్ని ఎస్ఎంఎస్ చేస్తారు. మొబైల్ నెంబర్ని లాగిన్ ఐడీగానూ, పిన్ నెంబర్ని పాస్వర్డ్గానూ వినియోగించుకుని ఉచిత వైఫైని యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







