హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ తాత్కాలిక మూసివేత!

- September 09, 2016 , by Maagulf
హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ తాత్కాలిక మూసివేత!

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)కు చెందిన ముంబయి రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం ఈ రిఫైనరీ ద్వారా రోజుకు 1,30,000 బారెల్స్‌ ముడి చమురును శుద్ధి చేస్తున్నారు. రిఫైనరీలో సాంకేతిక సమస్య తలెత్తడం, గ్యాస్‌లైన్‌ను దిగుమతి చేసుకోనుండటం తదితర కారణాల వల్ల రిఫైనరీని మూసివేస్తున్నట్లు హెచ్‌పీసీఎల్‌ వర్గాలు వెల్లడించాయి.'సాంకేతిక సమస్య కారణంగా రిఫైనరీని సెప్టెంబర్‌ 1న మూసివేశాం. సమస్య పరిష్కారమయ్యాక ఈనెల 13, లేదా 14న తిరిగి ప్రారంభిస్తాం' అని హెచ్‌పీసీఎల్‌ అధికార వర్గాలు వెల్లడించాయి.కాగా, జులై 2019 నాటికి 1,90,000 బ్యారెల్స్‌ ముడి చమురును శుద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com