ఒమన్లో జీతాలందక వలస కార్మికుల ఆందోళన
- September 09, 2016
డజన్ల సంఖ్యలో ఆగ్రహావేశాలతో ఉన్న కార్మికులు ఒమన్లో ఆందోళన చేపట్టారు. వారు పనిచేస్తున్న కంపెనీ, జీతాల్ని నిలిపివేయడం, అలాగే ఎంప్లాయ్మెంట్ వీసాల్ని పునరుద్ధరించకపోవడంతో తాము ఆందోళన చేపట్టినట్లు వలస కార్మికులు తెలిపారు. మస్కట్లోని ఓ కన్స్ట్రక్షన్ సైట్లో 80 మంది వరకు కార్మికులు, ఉద్యోగం కోల్పోయి, జీతం అందక, సరైన ఆహారం, వైద్య సహాయం లేకుండా గత నాలుగు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేయగా, ఆ రాజీనామాల్ని ఆ కంపెనీ ఆమోదించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి వీసా కూడా ఎక్స్పైర్ కావడంతో ఎటూ వెళ్ళలేని పరిస్థితి. అందుకే వారంతా అక్రమంగా ఒమన్లో నివసిస్టున్నట్లయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకూ కేవలం మూడు నుంచి నాలుగు నెలల జీతం మాత్రమే వారిలో కొంతమంది అందుకున్నారు. మిగతావారి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కంపెనీ వర్గాలు వాటిని ఎప్పుడు క్లియర్ చేస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఒమన్లోని ట్రేడ్ యూనియన్ లీడర్స్, కంపెనీలు ఇలా కార్మికుల్ని రోడ్డున పడేయడం తగదని చెబుతున్నారు. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉండటంతోనే తాము ఏమీ చేయలేకపోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







