ధృవ రిలీజ్ పోస్ట్ పోన్ ....
- September 10, 2016
మెగాఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న చిత్రాల్లో రాంచరణ్ నటిస్తున్ ధృవ చిత్రం ఒకటి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించారు. కానీ...ధృవ దసరాకి రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనక సెంటిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో దసరాకి రిలీజైన గోవిందు అందరివాడేలే, బ్రూస్ లీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత సందడి చేయలేకపోయాయి. అందుకే ధృవ మూవీని దసరాకు కాకుండా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.సెంటిమెంట్ కారణంగా ధృవ రిలీజ్ పోస్ట్ పోన్ వార్తలపై మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉన్నారట. అయితే డేట్ మార్పుపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది.మరోవైపు డీవైడ్ టాక్ లోనూ జనతాగ్యారేజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ జనతాను ధృవ బీట్ చేస్తాడని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో జనతా గ్యారేజ్ను ధృవ మించిపోయాడు. వైజాగ్లో జనతా హక్కులు 5.1 కోట్లకు అమ్ముడు కాగా...ధృవ 5.4 కోట్లు కొల్లగొట్టిందట. దీనిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోందని సమాచారం. ధృవ ప్రీరిలీజ్ బిజినెస్ అటు ఎన్టీఆర్ అభిమానులకే కాక, సినీ వర్గాలకు సైతం ఆశ్చర్యాని గురిచేసిందట. మునుముందు ధృవ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







