త్వరలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ

- September 10, 2016 , by Maagulf
త్వరలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ త్వరలోనే ఉంటుందన్నది కొంతకాలంగా వినిపిస్తోన్న మాట. దీనిపై ఇప్పుడు చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. దసరా తర్వాత జరుగబోయే ఎపి క్యాబినెట్ రీ షఫ్లింగ్ లో ఐదుగురు కొత్తవాళ్లకు అవకాశం దక్కనుందని సమాచారం.
వీళ్లెవరంటే.. అనిత, భూమా నాగిరెడ్డి, బొండా ఉమ, లోకేష్. వైసిపి ఎమ్మెల్యే రోజాపై వీరోచిత పోరాటం చేసిన అనిత కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఎసి ఛైర్మన్ పదవినికూడా వదులుకుని వచ్చిన భూమా నాగిరెడ్డి, ఇటీవల పార్టీ వాణిని గట్టిగా వినిపిస్తూ కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా ఉమ, ఇక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తోన్న లోకేష్ ను ప్రభుత్వంలోకి తీసుకోవాలని చాలా కాలంగా తెలుగుతమ్ముళ్లు చేస్తున్న డిమాండ్ మేరకు నారా లోకేష్.ఈ దఫా మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నారన్నది విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక ఐదో వ్యక్తి ఎవరనేదానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com