చేతిరాత పాస్‌పోర్టుల్ని మార్చుకోండి: ఇండియన్స్‌కి సూచన

- September 11, 2016 , by Maagulf
చేతిరాత పాస్‌పోర్టుల్ని మార్చుకోండి: ఇండియన్స్‌కి సూచన

అబుదాబీ: యూఏఈలో భారతీయ వలసదారులు ఎవరైతే ఇంకా చేతి రాత కలిగిన పాస్‌పోర్టుల్ని వినియోగిస్తున్నారో తక్షణం వాటిని మెషీన్‌ రీడ్‌ పాస్‌పోర్టులతో రీప్లేస్‌ చేసుకోవాల్సిందిగా అబుదాబీలోని ఇండియన్‌ ఎంబసీ సూచించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్టర్నల్‌ ఎఫైర్స్‌ (ఇండియా) సూచన మేరకు ఈ ప్రకటన చేసింది ఎంబసీ. 2015, నవంబర్‌ 25వ తేదీని గతంలో డెడ్‌లైన్‌గా ప్రకటించినా ఇంకా అంతర్జాతీయంగా 200,000 పాస్‌పోర్టులు ఇంకా చేతిరాతతోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మెషీన్‌ రీడింగ్‌ పాస్‌పోర్టులతో ప్రయాణాలు ఇంకా సులభతరం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇండియన్‌ ఎంబసీ వెబ్‌సైట్‌తోపాటు, మరో వెబ్‌సైట్‌లోనూ సంప్రదించి, మెషీన్‌ రీడింగ్‌ పాస్‌పోర్టులను పొందవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com