స్కూల్ సమీపంలో పేలిన గ్యాస్ సిలెండర్లు
- September 11, 2016
మనామా: దుండగులు రెండు గ్యాస్ సిలెండర్లను బిలాద్ అల్ కదీమ్ గ్రామంలో పేల్చిన ఘటన తీవ్ర భయాందోళనల్ని కలిగించింది. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోని ఓ స్కూల్ వద్ద ఈ పేలుళ్ళు సంభవించాయి. అయితే ఈ పేలుళ్ళలో ఎవరూ గాయపడలేదు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ వివరాల్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. స్కూల్ గోడను ఈ పేలుళ్ళు ధ్వంసం చేశాయనీ, అదృస్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్కూల్ భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి, మంటల్ని ఆర్పి వేశారని, తీవ్రవాదుల ఘాతుకాన్ని ఖండిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొద్ది రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ దాడులు అత్యంత హేయమని మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







