పారా ఒలింపిక్స్లో బహ్రెయిన్కి తొలి గోల్డ్ మెడల్
- September 12, 2016మనామా: 2016 రియో పారా ఒలింపిక్ గేమ్స్లో బహ్రెయిన్కి తొలి గోల్డ్ మెడల్ అభించింది. షాట్పుట్ కాంపిటీషన్లో బహ్రెయిన్కి చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్ గోల్డ్ మెడల్ని కైవసం చేసుకుంది. 4.76 మీటర్ల రికార్డ్ సాధించింది ఫాతిమా. భారత్కి చెందిన దీపా మాలిక్, గ్రీక్కి చెందిన డిమిత్రా కోరకిడాతో తలపడ్డ ఫాతిమా మొదటి స్థానాన్ని గెల్చుకుంది. దీపా మాలిక్కి ఈ విభాగంలో రజత పతకం లభించింది. బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ దుయైజ్ అల్ ఖలీఫా, ఈ మెడల్ని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతోపాటు ్పఐమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, డిప్యూటీ సుప్రీం కమాండర్ అండ్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, తదరులకు అంకితం చేశారు. షేక్ మొహమ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈద్ అల్ అదా సందర్భంగా బహ్రెయిన్ ఈ ఘనతను సాధించడం అద్భుతమని కొనియాడారు. రియో 2016 పారా ఒలింపిక్ గేమ్స్లో 170 దేశాలకు చెందిన 4,500 మంది క్రీడాకారులు 32 ఈవెంట్లలో 526 మెడల్స్ కోసం పోటీ పడుతున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి