షూటింగ్ పూర్తి చేసుకున్న 'కాల్మనీ'..
- September 14, 2016
'కాల్మనీ' వ్యవహారం ఆమధ్య ఆంధ్ర ప్రదేశ్లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనలు ఆధారంగా.. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఆ చిత్రం పేరు 'కాల్మనీ'.కృష్ణుడు, అంజనీకుమార్, సందీప్తి, నామాల మూర్తి ముఖ్య తారాగణంగా మక్కెన్ రంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'కాల్మనీ' చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'ఓ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఓ డాన్ భరతం-`ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ ఎలా పట్టాడన్నది క్లుప్తంగా కథాంశం.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించి త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీనివాస్, కెమెరా: వీణ ఆనంద్, సంగీతం: అర్జున్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: మక్కెన్ రంగా.
ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీనివాస్, కెమెరా: వీణ ఆనంద్, సంగీతం: అర్జున్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: మక్కెన్ రంగా.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







