బ్యాగేజ్ డిలేతో ఒమన్ ఎయిర్ కేరళ ప్రయాణీకుల వెతలు
- September 14, 2016
మస్కట్: మస్కట్ నుంచి కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న ప్రయాణీకులకు వారి బ్యాగేజీ అందక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి చింతిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్న ఒమన్ ఎయిర్ వర్గాలు, వీలైనంత త్వరగా వారి లగేజ్ని వారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఒమన్ ఎయిర్కి సంబంధించిన విమానాలన్నీ ఫుల్ అవుతున్నాయి. దాంతో, ఆపరేషనల్ సమస్యలు తలెత్తి లగేజ్ డిలే ఏర్పడిందని అధికారిక వర్గాలు ధీవీకరించాయి. సోమవారం వచ్చిన విమానంలో 70 మంది ప్రయాణీకులకు మంగళవారం బ్యాగేజ్లు అందగా, మరికొందరు ఇంకా తమ బ్యాగేజీల కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఈద్ అల్ అదా మరియు ఓనమ్ సందర్భంగా ప్రయాణీకులకు వరుస సెలవులు వచ్చాయి. దాంతో, అన్ని విమానాలూ ఫుల్ ప్యాక్డ్గా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇన్ని రోజులు సెలవులు రావడం ఇదే మొదటిసారి. మొత్తం 9 రోజులపాటు ఒమన్లో ఉంటున్నవారికి సెలవులు వచ్చాయి. దాంతో సొంత ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులతో అన్ని విమానాలూ కిటకిటలాడుతున్నట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







