బ్యాగేజ్ డిలేతో ఒమన్ ఎయిర్ కేరళ ప్రయాణీకుల వెతలు
- September 14, 2016
మస్కట్: మస్కట్ నుంచి కేరళలోని కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న ప్రయాణీకులకు వారి బ్యాగేజీ అందక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి చింతిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్న ఒమన్ ఎయిర్ వర్గాలు, వీలైనంత త్వరగా వారి లగేజ్ని వారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. లాంగ్ వీకెండ్ రావడంతో ఒమన్ ఎయిర్కి సంబంధించిన విమానాలన్నీ ఫుల్ అవుతున్నాయి. దాంతో, ఆపరేషనల్ సమస్యలు తలెత్తి లగేజ్ డిలే ఏర్పడిందని అధికారిక వర్గాలు ధీవీకరించాయి. సోమవారం వచ్చిన విమానంలో 70 మంది ప్రయాణీకులకు మంగళవారం బ్యాగేజ్లు అందగా, మరికొందరు ఇంకా తమ బ్యాగేజీల కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఈద్ అల్ అదా మరియు ఓనమ్ సందర్భంగా ప్రయాణీకులకు వరుస సెలవులు వచ్చాయి. దాంతో, అన్ని విమానాలూ ఫుల్ ప్యాక్డ్గా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇన్ని రోజులు సెలవులు రావడం ఇదే మొదటిసారి. మొత్తం 9 రోజులపాటు ఒమన్లో ఉంటున్నవారికి సెలవులు వచ్చాయి. దాంతో సొంత ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులతో అన్ని విమానాలూ కిటకిటలాడుతున్నట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









