క్రేన్ క్రాష్ ఘటన బాధితులకు స్పెషల్ 'హజ్'
- September 14, 2016
మక్కా గ్రాండ్ మాస్క్లో గత ఏడాది జరిగిన క్రేన్ క్రాష్ ఘటనలో తీవ్ర గాయాల పాలై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, ఈ ఏడాది హజ్ ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వారిలో ట్యునీషియాకి చెందిన యూసుఫ్ అనే వ్యక్తి, తనకు కల్పించిన హజ్ సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వైద్య ఖర్చులు భరించడంతోపాటుగా, హజ్ యాత్ర నిర్వహించేందుకుగాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సౌకర్యం ఉన్న అంబులెన్స్ని ఏర్పాటు చేశారని తెలిపాడాయన. హజ్ యాత్ర సందర్భంగా పూర్తిస్థాయిలో వైద్య సహాయం తనకు అందిందని వివరించారు యూసుఫ్. గత ఏడాది గ్రాండ్ మాస్క్లో జరిగిన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ షాక్కి గురిచేసింది. అయితే ఆనాటి ఘటన పట్ల ఆందోళన కొంత ఉన్నా, హజ్ యాత్రకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో యాత్రీకులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









