క్రేన్ క్రాష్ ఘటన బాధితులకు స్పెషల్ 'హజ్'
- September 14, 2016
మక్కా గ్రాండ్ మాస్క్లో గత ఏడాది జరిగిన క్రేన్ క్రాష్ ఘటనలో తీవ్ర గాయాల పాలై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, ఈ ఏడాది హజ్ ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వారిలో ట్యునీషియాకి చెందిన యూసుఫ్ అనే వ్యక్తి, తనకు కల్పించిన హజ్ సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వైద్య ఖర్చులు భరించడంతోపాటుగా, హజ్ యాత్ర నిర్వహించేందుకుగాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సౌకర్యం ఉన్న అంబులెన్స్ని ఏర్పాటు చేశారని తెలిపాడాయన. హజ్ యాత్ర సందర్భంగా పూర్తిస్థాయిలో వైద్య సహాయం తనకు అందిందని వివరించారు యూసుఫ్. గత ఏడాది గ్రాండ్ మాస్క్లో జరిగిన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ షాక్కి గురిచేసింది. అయితే ఆనాటి ఘటన పట్ల ఆందోళన కొంత ఉన్నా, హజ్ యాత్రకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో యాత్రీకులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







