'పింక్‌' చిత్రం ఈ దేశానికి చాలా ముఖ్యం : రానా

- September 14, 2016 , by Maagulf
'పింక్‌' చిత్రం ఈ దేశానికి చాలా ముఖ్యం : రానా

ముంబయి: 'పింక్‌' చిత్రం భారతదేశానికి చాలా ముఖ్యమని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'ఇప్పుడే అద్భుతమైన చిత్రాన్ని చూశాను. 'పింక్‌' చిత్రం ఈ దేశానికి చాలా ముఖ్యం' అని ట్వీట్‌ చేశారు. దీనికి తాప్సి స్పందిస్తూ.. రానాకు ధన్యవాదాలు తెలిపారు.ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'పింక్‌' చిత్రాన్ని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు గత కొద్దిరోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌లో చూశారు. కంగనా రనౌత్‌, కృతి సనన్‌, దియామీర్జా, సోఫీచౌదరి, ప్రీతీజింటా, యామీ గౌతమ్‌ తదితరులు చిత్రాన్ని చూశారువీరిలో పలువురు ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com