ఎయిర్ అంబులెన్స్లో ఇండియాకి
- September 15, 2016
అబుదాబీ: బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఇండియాకి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఎలియాస్ జార్జ్ని అబుదాబీ నుంచి అతని స్వస్థలం ఇండియాలోని కోచికి తరలించేందుకోసం ఎయిర్ అంబులెన్స్ని వినియోగించనున్నారు. జులై 16న జార్జ్కి బ్రెయిన్ స్ట్రోక్ రాగా, అబుదాబీలోని క్లీవ్ల్యాండ్ క్లినిక్లో చేర్చారు. అక్కడే అతనికి రెండు నెలలుగా వైద్య చికిత్స అందుతోంది. స్థానికంగా ఉన్న ఓ కంపెనీ, అతని వైద్య ఖర్చుల్ని భరిస్తోంది. అయితే ఆ సంస్థ పేరు వెల్లడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఆ సంస్థ తమను ఆదుకునేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయమని జార్జ్ సోదరుడు ఆస్టిన్ బ్రూజ్ చెప్పారు. అబుదబీ బతీన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 11 గంటల సమయంలో విమానం బయల్దేరనుంది జార్జ్తోపాటుగా. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సాయంత్రం 4.30 నిమాషాల సమయంలో చేరుకుంటుంది. ఈ ఎయిర్ అంబులెన్స్లో డాక్టర్, పారా మెడిక్ ఉంటారు. ఎయిర్ అంబులెన్స్ కోసం 130,000 దిర్హామ్లు ఖర్చు చేస్తున్నారు. జార్జ్ పనిచేస్తున్న సంస్థ ముందుగా ఎయిర్ అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తే 200,000 దిర్హామ్లకు కొటేషన్ ఇచ్చారు. అయితే ఆసుపత్రి వర్గాలు చొరవ తీసుకోవడంతో కాస్త తక్కువ ధరకే ఎయిర్ అంబులెన్స్ దక్కింది. ఇంకో వైపున పోలీసులు 30 కిలోమీటర్ల రోడ్ ట్రాఫిక్ని జార్జ్ కోసం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







