పర్షియన్‌ గల్ఫ్‌లో తిష్ట వేసిన అమెరికా సేనలు వైదొలగాలి: ఆలీ షంఖానీ

- September 16, 2016 , by Maagulf
పర్షియన్‌ గల్ఫ్‌లో తిష్ట వేసిన అమెరికా సేనలు  వైదొలగాలి: ఆలీ షంఖానీ

 పర్షియన్‌ గల్ఫ్‌లో తిష్ట వేసిన అమెరికా సేనలు తక్షణమే ఇక్కడి నుండి వైదొలగాలని ఇరాన్‌ జాతీయ భద్రతా మండలి ప్రధాన కార్యదర్శి ఆలీ షంఖానీ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఇక్కడ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పర్షియన్‌ గల్ఫ్‌లో ప్రాంతీయ దేశాల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు కొనసాగటానికి ఎటువంటి చట్టపరమైన ప్రాతిపదిక లేదని, అంతర్జాతీయంగా మద్దతుకూడా లేదని అన్నారు. ఇరాన్‌ తమను రెచ్చగొడుతోం దంటూ అమెకిరా చేస్తున్న ఆరోపణలు తమపై అమెరికన్‌ మీడియా చేస్తున్న ఊహాగానాలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో వున్న అమెరికా యుద్ధ నౌకల సమీపంలోకి ఇరాన్‌ యుద్ధ నౌకలు వస్తున్నాయంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టంచేశారు.అమెరికా పర్షియన్‌ గల్ఫ్‌ను వదిలి వెళ్లిపోతే ఇక్కడ ఎటువంటి సమస్యలూ వుండవన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com