పర్యావరణ ఇంధన ప్రాజెక్టుకు 26 వేలమంది కార్మికులు అవసరం...

- September 16, 2016 , by Maagulf
పర్యావరణ ఇంధన ప్రాజెక్టుకు 26 వేలమంది కార్మికులు అవసరం...

కువైట్ సిటీ,: పర్యావరణ ఇంధన ప్రాజెక్ట్ కోసం 26 వేలమంది కార్మికులు అవసరం కాగా, వివిధ దేశాలకు చెందిన సుమారు వేయమంది ఉద్యోగులు వారానికి  ఈ ప్రయోజనం కోసం కువైట్ చేరుకొంటున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కె ఎన్ పి సి ) లో ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఆ సమాచారం ప్రకారం ఈ  ప్రాజెక్టు 65 శాతం పనులు ఇప్పటి వరకు పూర్తికాబడిందని మిగిలిన 80 శాతం పనులు మార్చి 31, 2017 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి కాగలదని అంచనా వేయబడింది. ఫింటస్ , మఃబౌల  మరియు మంగాఫ్  ప్రాంతాలలో  మూడు సంవత్సరాలుగా ఉన్న ఖాళీ భవనాలు మరియు అపార్ట్ సంబంధించిన కార్మిక సమస్యలను సైతం  పర్యావరణ ఇంధన ప్రాజెక్ట్ పరిష్కరించుకుంది   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com