భారత స్టార్‌ క్రికెటర్లకు 'అర్జున' ప్రదానం

- September 16, 2016 , by Maagulf
భారత స్టార్‌ క్రికెటర్లకు 'అర్జున' ప్రదానం

ఉత్తమ ప్రతిభ కనబర్చిన భారత స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, అజింక్య రహానెలకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌గోయల్‌ దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ప్రదానం చేశారు.

అర్జున అవార్డులను 1961లో నెలకొల్పారు. ఈ అవార్డు అందుకుంటున్న సమయానికి ముందు నాలుగేళ్లు వరుసగా నిలకడగా రాణించిన క్రీడాకారులతో పాటు నాయకత్వం, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణలను పరిగణలోకి తీసుకోని వీటిని అందజేస్తున్నారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com