అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదు : నాయిని

- September 16, 2016 , by Maagulf
అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదు : నాయిని

అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17 సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను హోంమంత్రి ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమోచన దినాన్ని జరపాలనేది బీజేపీ డిమాండ్ అని అయితే భారత్‌లో విలీనమవుతామని వల్లభాయ్‌పటేల్‌కు ఆనాడు నిజాం చెప్పారని గుర్తు చేశారు. మతసామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కేసీఆర్‌ పాలన కొనసాగుతుందని తెలిపారు.రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన రోజు ఇది అని హోంమంత్రి నాయిని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com