అక్టోబరు 7న ఆరు సినిమాలు విడుదల...
- September 18, 2016
పెద్ద పండుగ దసరా వస్తోంది. టాలీవుడ్ నుంచి సినిమాల జోరు పెరగనుంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా వరుసగా ఆరు సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబరు 11న పండుగ అయినప్పటికీ సెలవుల సీజన్ అంతకు ముందే ప్రారంభమవుతుంది గనుక మేకర్స్ దీన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. హాలిడే మూడ్ని తమ చిత్ర్రాల బిజినెస్కి అనుకూలంగా మార్చుకునే యోచనలో ఉన్నారు. ఈ ఆరు సినిమాల్లో అయిదు మీడియం బడ్జెట్ చిత్రాలు కాగా.. ఒకటి హై బడ్జెట్ మూవీ. నాగ చైతన్య 'ప్రేమమ్', కళ్యాణ్రామ్ 'ఇజం', తమన్నా నటించిన 'అభినేత్రి', మూవీలు అక్టోబరు 7న విడుదల కానున్నాయి.
ప్రకాష్ రాజ్ మూవీ 'మన ఊరి రామాయణం', సునీల్ నటించిన 'ఈడు గోల్డ్ ఎహె' కూడా అదే రోజున రిలీజ్ కాబోతున్నాయి.వీటిలో 'ప్రేమమ్', 'ఇజం', 'అభినేత్రి' చిత్రాల బడ్జెట్లు సుమారు ఇరవయ్యేసి కోట్ల చొప్పున కాగా.. 'మన ఊరి రామాయణం' కేవలం 3 కోట్ల బడ్జెట్ మూవీ. ఇక 'ఈడు గోల్డ్ ఎహె' చిత్రాన్ని 15 కోట్లతో తీశారట. అయితే.. కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ మొదటిసారి హీరోగా నటించిన 'జాగ్వార్' 75 కోట్ల భారీ బడ్జెట్ సినిమా. ఈ మూవీలన్నీ కలిపి దాదాపు 130 కోట్లకు పైగా బడ్జెట్తో తీసినవి. వీటిలో ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో ఆడియెన్సే డిసైడ్ చేస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







