ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినతర చర్యలు : యూకే
- September 18, 2016
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై తీసుకునే చర్యలను యూకే ప్రభుత్వం కఠినతరం చేసింది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, మెసెజ్లు చేయడం, ఈ మెయిల్ పంపడం వంటి చర్యలకు పాల్పడే వారికి కఠినమైన తీసుకునేందుకుగానూ నూతన నిబంధనలను తేనుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న ఈ నూతన నిబంధనల ప్రకారం ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారికి 200 పౌండ్స్ జరిమానా విధించనున్నట్లు యూకే రవాణా మంత్రి క్రిస్ గ్రెలింగ్ తెలిపారు.
ఫోన్ వాడుతూ పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్పై ఆరు పాయింట్లు చేరుతాయని, ఇలా వారి పాయింట్లు 12కు చేరితే సదరు వ్యక్తి లైసెన్స్ రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ నిబంధనలు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్లో వర్తించనున్నాయన్నారు. రెండు సార్లు ఇలా పట్టుబడితే వారి లైసెన్సును ఆరు నెలలు రద్దు చేయడమేకాకుండా కనీసం 1,000 పౌండ్ల జరిమానా విధించనున్నామని ఆయన వివరించారు. త్వరలోనే ఈ నిబంధనలను అమలు చేయనున్నామని, ఈ నిబంధనల ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నామని గ్రెలింగ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









