ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం ముదిరిపాకాన పడింది..
- September 19, 2016
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం ముదిరిపాకాన పడింది. రాజధాని విషయంలో ఇప్పటికే కోర్టుకెక్కిన సీనియర్ జర్నలిస్టు ఏబీకె ప్రసాద్ అక్కడితో వదల్లేదు. లేటెస్ట్గా ఈ వ్యవహారాన్ని రాజకీయ మలుపు తిప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో ఇక్కడొక పెద్ద ఆరాచకమే జరిగిపోతోందంటూ కేంద్ర నాయకత్వానికి పితూరీలు పంపారు. రాష్ర్టపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి ఈ మేరకు ఏబీకె పంపిన ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
రాజధాని ప్రాంతంలో పంట భూములు తగలబడడం, రైతాంగం నుంచి భూసేకరణ వివాదం, అమరావతికి 'వరద ముప్పు', కొండవీటి వాగు ఇష్యూ వంటి అంశాలపై ప్రభుత్వం అస్పష్ట వైఖరితో ముందుకెళ్తోందని ఏబీకే ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
అలాగే సీఆర్డీఏ భూములను కొనుగోలు చేసినట్టు స్వయానా కేంద్రమంత్రి సుజనాచౌదరే అంగీకరించిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు ఏబీకే. సో.. అమరావతి పంచాయితీ ఢిల్లీకి చేరిందన్నమాట.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









