ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం ముదిరిపాకాన పడింది..
- September 19, 2016
ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం ముదిరిపాకాన పడింది. రాజధాని విషయంలో ఇప్పటికే కోర్టుకెక్కిన సీనియర్ జర్నలిస్టు ఏబీకె ప్రసాద్ అక్కడితో వదల్లేదు. లేటెస్ట్గా ఈ వ్యవహారాన్ని రాజకీయ మలుపు తిప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో ఇక్కడొక పెద్ద ఆరాచకమే జరిగిపోతోందంటూ కేంద్ర నాయకత్వానికి పితూరీలు పంపారు. రాష్ర్టపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి ఈ మేరకు ఏబీకె పంపిన ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
రాజధాని ప్రాంతంలో పంట భూములు తగలబడడం, రైతాంగం నుంచి భూసేకరణ వివాదం, అమరావతికి 'వరద ముప్పు', కొండవీటి వాగు ఇష్యూ వంటి అంశాలపై ప్రభుత్వం అస్పష్ట వైఖరితో ముందుకెళ్తోందని ఏబీకే ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
అలాగే సీఆర్డీఏ భూములను కొనుగోలు చేసినట్టు స్వయానా కేంద్రమంత్రి సుజనాచౌదరే అంగీకరించిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు ఏబీకే. సో.. అమరావతి పంచాయితీ ఢిల్లీకి చేరిందన్నమాట.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







