ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం డిస్కౌంట్ ఆఫర్
- September 19, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం డిస్కౌంట్ ఆఫర్ లో బంపర్ ఆఫర్ ధరలను ప్రకటించింది. రూ. 900 ప్రారంభ ధరలతో విమాన చార్జీల్లో ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. కొచీ-తిరువంతపురం, జైపూర్-ఢిల్లీ, గౌహతి-బాగ్డోగ్రా, చండీగఢ్-శ్రీనగర్ తదితర మార్గాల్లో, లిమిటెడ్ సీట్లకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
హైదరాబాద్-కోయంబత్తూరు, ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గాల మధ్య ప్రారంభ ఛార్జీలురూ1,299లు, ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల మధ్య రూ. 3,199 ప్రారంభమవుతాయి. అలాగే హైదరాబాద్- గోవా మధ్య రూ.1,699 లు, ఢిల్లీ - వడోదర మధ్య రూ.2,599లుగా ను ఇండిగో ప్రకటించింది.
అయితే ఎప్పటినుంచి ఎప్పటిదాకా ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలను బహిర్గతం చేయలేదు. అయితే వెబ్ సైట్ చెక్ చేసినపుడు విభిన్న మార్గాల్లో ఈ నెలనుంచి వచ్చే ఏడాదిదాకా వర్తించనున్నట్టు తెలుస్తోంది.
కాగా దేశీయ విమానయానంలో గత కొన్నేళ్లుగా డిమాండ్ భారీగానే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ జూలైలో 26 శాతానికి పైగా డిమాండ్ పెరుగుదల నమోదైనట్టు విశ్లేషకులు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







