ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం డిస్కౌంట్ ఆఫర్
- September 19, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం డిస్కౌంట్ ఆఫర్ లో బంపర్ ఆఫర్ ధరలను ప్రకటించింది. రూ. 900 ప్రారంభ ధరలతో విమాన చార్జీల్లో ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. కొచీ-తిరువంతపురం, జైపూర్-ఢిల్లీ, గౌహతి-బాగ్డోగ్రా, చండీగఢ్-శ్రీనగర్ తదితర మార్గాల్లో, లిమిటెడ్ సీట్లకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
హైదరాబాద్-కోయంబత్తూరు, ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గాల మధ్య ప్రారంభ ఛార్జీలురూ1,299లు, ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల మధ్య రూ. 3,199 ప్రారంభమవుతాయి. అలాగే హైదరాబాద్- గోవా మధ్య రూ.1,699 లు, ఢిల్లీ - వడోదర మధ్య రూ.2,599లుగా ను ఇండిగో ప్రకటించింది.
అయితే ఎప్పటినుంచి ఎప్పటిదాకా ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలను బహిర్గతం చేయలేదు. అయితే వెబ్ సైట్ చెక్ చేసినపుడు విభిన్న మార్గాల్లో ఈ నెలనుంచి వచ్చే ఏడాదిదాకా వర్తించనున్నట్టు తెలుస్తోంది.
కాగా దేశీయ విమానయానంలో గత కొన్నేళ్లుగా డిమాండ్ భారీగానే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ జూలైలో 26 శాతానికి పైగా డిమాండ్ పెరుగుదల నమోదైనట్టు విశ్లేషకులు తెలిపారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









