ఆస్ట్రేలియా ఎంటర్ప్రెన్యూవర్ వీసా వల్ల పర్మినెంట్ రెసిడెన్స్కు బాట
- September 19, 2016
ప్రతిభానైపుణ్యాలుగలవారికి శుభవార్త! ఆస్ట్రేలియాలో తమ ఘనతను చాటాలనుకునేవారికి ఆ దేశం ఆకర్షణీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. అత్యుత్తమ ప్రతిభావంతులను తమ దేశంలోనే స్థిరపడేలా చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. దీనిలో భాగంగా కొత్త రకం వీసాలను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇమ్మిగ్రేషన్, బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ మంత్రి పీటర్ దుట్టన్ మాట్లాడుతూ బిజినెస్ ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ వీసా ప్రోగ్రామ్ సహా వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థిక వృద్ధిని పరుగులెత్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎంటర్ప్రెన్యూవర్ వీసా వల్ల పర్మినెంట్ రెసిడెన్స్కు బాటలు వేస్తుందని చెప్పారు.
2 లక్షల డాలర్ల పెట్టుబడికి థర్డ్ పార్టీ నుంచి మద్దతు లభిస్తుందని, ప్రతిభావంతులు తమ వినూత్న ఆలోచనలను ఆస్ట్రేలియాలో ఆచరణలో పెట్టవచ్చునని తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నైపుణ్యంగలవారికి నిర్వహించే పరీక్షల్లో ఇటీవల మార్పులు జరిగాయి. ఆస్ట్రేలియాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం వంటి రంగాల్లో పోస్ట్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ క్వాలిఫికేషన్ పొందినవారిని ఆస్ట్రేలియాలోనే స్థిరపడేలా చేయడానికి ఈ మార్పులు దోహదపడతాయి. ఈ గ్రాడ్యుయేట్లకు స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్ క్రింద అదనపు పాయింట్లు ఇస్తారు.
దీనివల్ల ఆస్ట్రేలియాలో పర్మినెంట్ రెసిడెన్స్ వీసా మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ మార్పులు ప్రభుత్వం చేపట్టిన జాతీయ నూతన ఆవిష్కరణలు, సైన్స్ ఎజెండాకు అనుబంధంగా ఉపయోగపడతాయని ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ సైన్స్ మినిస్టర్ గ్రెగ్ హంట్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









