ఏ.పి రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి విమానాశ్రయాలకు కనెక్టివిటీ...
- September 19, 2016
రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన డైరెక్టర్ ఆర్.ఎన.చౌబేను సీఎం చంద్రబాబు కోరారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు దేశంలోని ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు, ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో నేషనల్ ఏవియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
రాషా్ట్రనికి అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా వచ్చేలా చేయాలని చౌబేకి సూచించారు. ఏపీలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ఏవియేషన్ అధికారులకు తెలిపారు. విశాఖలో ఏవియేషన్ ఆధ్వర్యంలో పైలట్ టె్త్రనింగ్ సెంటర్ ఏర్పాటుపై సీఎం సూచనపై ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాత్సవ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్రో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







