రహదారుల దుస్థితిపై కేటీఆర్ దృష్టి
- September 20, 2016
వర్షాలకు హైదరాబాద్ నగరంలో రహదారులు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో వాటి దుస్థితిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషననర్ జనార్ధన్ రెడ్డితో పాటు మెట్రో రైలు, జలమండలి, టీఎస్ఐఐసీ, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. తక్షణమే 150 బృందాలను ఏర్పాటు చేసి నగరంలో యుద్ధప్రాతిపదికన రహదార్ల మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. నాణ్యాతా విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు రహదార్లు వేసే సమయంలో నిర్ణీత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాలన్నీ రానున్న నెల రోజల పాటు పూర్తిగా హైదరాబాద్ రహదార్ల మరమ్మతు, నిర్వహణపైనే దృష్టి సారించాలని కేటీఆర్ ఆదేశించారు.తక్షణ మరమ్మతుల కోసం స్వల్పకాలిక చర్యలు చేపట్టడంతో పాటు మధ్యంతర, ధీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాలని సూచించారు
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









