రహదారుల దుస్థితిపై కేటీఆర్ దృష్టి
- September 20, 2016
వర్షాలకు హైదరాబాద్ నగరంలో రహదారులు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో వాటి దుస్థితిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషననర్ జనార్ధన్ రెడ్డితో పాటు మెట్రో రైలు, జలమండలి, టీఎస్ఐఐసీ, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. తక్షణమే 150 బృందాలను ఏర్పాటు చేసి నగరంలో యుద్ధప్రాతిపదికన రహదార్ల మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. నాణ్యాతా విభాగాన్ని పటిష్టం చేయడంతో పాటు రహదార్లు వేసే సమయంలో నిర్ణీత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాలన్నీ రానున్న నెల రోజల పాటు పూర్తిగా హైదరాబాద్ రహదార్ల మరమ్మతు, నిర్వహణపైనే దృష్టి సారించాలని కేటీఆర్ ఆదేశించారు.తక్షణ మరమ్మతుల కోసం స్వల్పకాలిక చర్యలు చేపట్టడంతో పాటు మధ్యంతర, ధీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్లాలని సూచించారు
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







