ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి ప్రయోగం..
- September 20, 2016
ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్ రేంజ్ క్షిపణిని మంగళవారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణిని ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా రూపొందించాయి. లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని.. త్వరలో మరిన్ని విడతల్లో ఈ క్షిపణిని ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్ అండ్ త్రెట్ అలర్ట్ రాడార్(ఎంఎఫ్-స్టార్) సిస్టమ్ ఉంటుంది. .భారత్, ఇజ్రాయెల్ రూపొందించిన ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్ క్షిపణిని డీఆర్డీఓ జూన్ 30- జులై 1 మధ్య వరసగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది.గత ఏడాది ఐఎన్ఎస్ కోల్కతా వాహక నౌకపై నుంచి కూడా ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్రేంజ్ క్షిపణి(ఎల్ఆర్-ఎస్ఏఎం)ని విజయవంతంగా ప్రయోగించారు
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









