ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి క్షిపణి ప్రయోగం..

- September 20, 2016 , by Maagulf
ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి క్షిపణి ప్రయోగం..

ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని మంగళవారం భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్‌డీఓ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణిని ఇజ్రాయెల్‌, భారత్‌ సంయుక్తంగా రూపొందించాయి. లాంగ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని.. త్వరలో మరిన్ని విడతల్లో ఈ క్షిపణిని ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్‌ సర్వైలెన్స్‌ అండ్‌ త్రెట్‌ అలర్ట్‌ రాడార్‌(ఎంఎఫ్‌-స్టార్‌) సిస్టమ్‌ ఉంటుంది. .భారత్‌, ఇజ్రాయెల్‌ రూపొందించిన ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్‌ క్షిపణిని డీఆర్‌డీఓ జూన్‌ 30- జులై 1 మధ్య వరసగా మూడుసార్లు విజయవంతంగా ప్రయోగించింది.గత ఏడాది ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా వాహక నౌకపై నుంచి కూడా ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే లాంగ్‌రేంజ్‌ క్షిపణి(ఎల్‌ఆర్‌-ఎస్‌ఏఎం)ని విజయవంతంగా ప్రయోగించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com