60శాతం ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల పెంపు
- September 20, 2016
జెడ్డా: జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కమిటీ, 60 శాతం స్కూల్స్, వార్షిక ఫీజుల్ని పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్లు అంచనా వేసింది. 25 శాతం నిర్వహణ ఖర్చులు పెరగడంతో స్కూళ్ళు ఫీజుల పెంపు నిర్ణయం తీసుకోనున్నాయని తెలియవస్తోంది. కమిటీ హెడ్, నేషనల్ కమిటీ - సౌదీ చాంబర్ మాలెక్ తలెబ్ ఈ విషయంపై మాట్లాడుతూ, మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ కన్నా ఫీజుల పెంపు నిర్ణయాన్ని స్కూళ్ళకే వదిలేయడం మంచిదనీ, ఈ నిర్ణయం ద్వారా స్కూళ్ళు, ఇంకా మెరుగైన సౌకర్యాల్ని విద్యార్థులకు కల్గించేందుకు ఆస్కారముంటుందని అభిప్రాయపడ్డారు. టీచర్లను హైర్ చేసుకోవడం, అలాగే టీచర్తోపాటు డిపెండెంట్స్కి కూడా ఇన్స్యూరెన్స్ చెల్లించడం వంటివాటి వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాంతో, పీజుల పెంపు తప్ప ఇంకో మార్గం కనిపించడంలేదు. ఇంకో వైపున నేషనల్ కమిటీ ఆఫ్ ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మెంబర్ దకీల్ అల్లా అల్ జోహాని ఈ విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రైవేటు స్కూళ్ళకు చాలా తక్కువగా మాత్రమే సహాయం అందిస్తోందనీ, ఒక స్టూడెంట్కి ఏడాదికి 100 సౌదీ రియాల్స్ మాత్రమే ప్రభుత్వం నుంచి దక్కుతోందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









