60శాతం ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల పెంపు
- September 20, 2016
జెడ్డా: జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కమిటీ, 60 శాతం స్కూల్స్, వార్షిక ఫీజుల్ని పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్లు అంచనా వేసింది. 25 శాతం నిర్వహణ ఖర్చులు పెరగడంతో స్కూళ్ళు ఫీజుల పెంపు నిర్ణయం తీసుకోనున్నాయని తెలియవస్తోంది. కమిటీ హెడ్, నేషనల్ కమిటీ - సౌదీ చాంబర్ మాలెక్ తలెబ్ ఈ విషయంపై మాట్లాడుతూ, మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ కన్నా ఫీజుల పెంపు నిర్ణయాన్ని స్కూళ్ళకే వదిలేయడం మంచిదనీ, ఈ నిర్ణయం ద్వారా స్కూళ్ళు, ఇంకా మెరుగైన సౌకర్యాల్ని విద్యార్థులకు కల్గించేందుకు ఆస్కారముంటుందని అభిప్రాయపడ్డారు. టీచర్లను హైర్ చేసుకోవడం, అలాగే టీచర్తోపాటు డిపెండెంట్స్కి కూడా ఇన్స్యూరెన్స్ చెల్లించడం వంటివాటి వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాంతో, పీజుల పెంపు తప్ప ఇంకో మార్గం కనిపించడంలేదు. ఇంకో వైపున నేషనల్ కమిటీ ఆఫ్ ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మెంబర్ దకీల్ అల్లా అల్ జోహాని ఈ విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రైవేటు స్కూళ్ళకు చాలా తక్కువగా మాత్రమే సహాయం అందిస్తోందనీ, ఒక స్టూడెంట్కి ఏడాదికి 100 సౌదీ రియాల్స్ మాత్రమే ప్రభుత్వం నుంచి దక్కుతోందని అన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







