' మిస్టర్ 420' ఈనెల 30న విడుదల కానుంది
- September 20, 2016
వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా నటించిన చిత్రం ' మిస్టర్ 420'. సాన్వి క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతోంది. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గజ్జల హరికుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గజ్జల హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ''సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాలో హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ను చూడగానే ప్రేమలో పడతాడు. అనుకోని ఘటనతో హీరో జీవితం మలుపు తిరుగుతుంది. అదేంటనేదే సినిమా. హీరోయిన్ ప్రియాంక ముంబై నుండి తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్తో మా బ్యానర్లో రెండో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని తెలిపారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ '' సినిమాలో అవినాష్ అనే యువకుడి పాత్రలో కనపడతాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగా రావడానికి రీషూట్ కూడా చేశాం. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒక చిత్రంలో రైతు పాత్ర చేస్తున్నాను. రామూర్తి దర్శకుడు. ఇక రెండో సినిమా రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన సత్యనారాయణ దర్శకత్వంలో చేస్తున్నాను'' అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కొరియో గ్రాఫర్ : రఘు, స్వర్ణ, శేఖర్, సుధీర్, స్టంట్స్ : నందు, పాటలు : చంద్రబోస్, అనంత శ్రీరామ్ ఎడిటింగ్ : నందమూరి హరి, సినిమాటోగ్రాఫర్ : జశ్వంత్ , మ్యాజిక్ : రియాన్ ముస్తఫా, డైలాగ్స్ : మోహన్ చంద్ర.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









