తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై భేటీకి రంగం సిద్ధo..

- September 20, 2016 , by Maagulf
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై భేటీకి రంగం సిద్ధo..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై తెలంగాణా, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు బుధవారం ఢిల్లీ లో చర్చలు జరపబోతున్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ మొట్ట మొదటి భేటీకి రంగం సిద్ధమైంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా..పాలమూరు-రంగారెడ్డి-దిండి ఎత్తిపోతలు, కృష్ణా, గోదావరి జలాల్లో వాటా అంశాలపై ఈ సిఎంలు చర్చించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి-దిండి ఎత్తిపోతలు పాత ప్రాజెక్టులేనని కేసీఆర్ నొక్కి చెప్పనున్నారని తెలుస్తోంది. ఏపీలో గోదావరి నుంచి కృష్ణా లోకి మళ్లించిన నీటిలో తెలంగాణాకూ వాటా ఉందన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించనున్నారు.అయితే చంద్రబాబు వాదన మరోలా ఉండే అవకాశం ఉంది.పాలమూరు-రంగారెడ్డి-దిండి ప్రాజెక్టులు కొత్తవేనని, పునర్విభజన చట్టంలోని 11 వ షెడ్యూల్ లో కూడా ఈ ప్రాజెక్టులు లేవన్న విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. పోలవరం పూర్తి అయ్యేలోగా కుడి కాలువను వినియోగించుకుని వృధాగా పోయే గోదావరి జలాల వినియోగానికే పట్టిసీమ చేపట్టామని, పోలవరం నిర్మాణం తరవాత ఇది ఉండదని, పట్టిసీమ కొత్త ప్రాజెక్టు కాదని ఆయన వివరించనున్నారు. ఇలా వీరి వాదనలు వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎలా ఉండబోతున్నదానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com