రాస్ తానురాలో అగ్ని ప్రమాదం 8 మంది కార్మికులకు గాయాలు
- September 20, 2016
జెడ్డా : సౌదీ అరంకో చమురు టెర్మినల్ ఫెసిలిటీ రాస్ తానురా లో మంగళవారం ఉదయం జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపదినట్లు సంబంధిత కంపెనీ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలోతెలిపింది. ఉదయం 9 గంటల సమయంలో అగ్నిఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడున్నవారిని బలవంతంగా తరలించడం జరిగింది.తీవ్రమైన నష్టం కలిగించక ముందే అగ్నిమాపకదళం అత్యవసర పరిస్థితికి అనుగుణంగా స్పందించి అగ్నిని అదుపు చేశారు.
అరంకో చమురు ఉద్యోగులు మరియు ఆరుగురు కాంట్రాక్టర్లు ఈ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. వీరందరూ వైద్య చికిత్స పొందారని తెలిపారు. ఈ స్వల్ప అగ్ని సంఘటన కారణంగా చమురు మరియు వాయువు కార్యకలాపాలని ప్రభావితం చేయ లేదని అరంకో ప్రతినిధి అన్నారు. రాస్ తానురా టెర్మినల్ రోజుకు 550,000 బ్యారళ్ల ముడి చమురుని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఇంకా ఏమీ తెలియ రాలేదని కారణం కనుగోవడానికి ఒక పరిపూర్ణమైన దర్యాప్తు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









