వారానికి 238 ట్రిప్స్‌: ఎస్‌ఆర్‌ఓ

- September 20, 2016 , by Maagulf
వారానికి 238 ట్రిప్స్‌: ఎస్‌ఆర్‌ఓ

దమ్మమ్‌: సౌదీ రైల్వేస్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌ఆర్‌ఓ), రియాద్‌, దమ్మమ్‌, హుఫుఫ్‌ మధ్య ఫ్రీక్వెన్సీని వారానికి 238 ట్రిప్స్‌కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 18 నుంచి ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. రియాద్‌ మరియు దమ్మమ్‌ మధ్య వారానికి 82 ట్రిప్పులు, రియాద్‌ మరియు హుఫుఫ్‌ మధ్య 68 త్రిప్పులు, దమమ్మమ్‌ మరియు హుఫుఫ్‌ మధ్య 88 ట్రిప్పులు ఇకపై నడిపేలా చర్యలు తీసుకున్నారు. కొత్త షెడ్యూల్‌ అబ్‌కైక్‌ స్టేషన్‌ (రియాద్‌ దమమ్మమ్‌ మరియు హఫఫ్‌) మధ్య 61 ట్రిప్‌లు ఉంటాయి. ఈ ట్రిప్‌ల పెంపకంతో ప్రయాణీకుల అవసరాలు తీరతాయని అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 888,000 మంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణీకుల సంఖ్య 49,000 వరకు పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com