1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాల దొంగలు పట్టివేత
- September 21, 2016
మస్కట్ : ముత్తరః మరియు సీబ్ ప్రాంతాలలో బంగారు దుకాణాలలో 1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాలని దొంగిలించిన ఘటనకు సంబంధించిన ఆసియా జాతీయులు సమూహ చోరులను రాయల్ ఒమాన్ పోలీసులు పట్టుకొన్నారు. సీబ్ మరియు ముత్తరః పోలీసు స్టేషన్లు సహకారంతో, విచారణలు మరియు మస్కట్ గవర్నటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్ జనరల్ ఈ కేసుని చేధించారు. రాయల్ ఒమాన్ పోలీసులకు చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ దొంగలు తొలుత ఆభరణాలను దుకాణాన్నీ ఎంచుకొని రక్షిత లోహ షట్టర్ కత్తిరించి లోపలకు ప్రవేశిస్తారని ఆయన తెలిపారు. ఈ దొంగలని పెట్టుకొనేందుకు ఒక ప్రత్యేక బృందం ఆభరణాల చోరీల దర్యాప్తునకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దొంగలు తమ నేరాలను ఒప్పుకున్నట్లు చెప్పారు. వీరు తమ ఇళ్లలో బంగారు వస్తువులు కరిగించి విదేశాలకు ఆ బంగారంనీ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తారని రాయల్ ఒమాన్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









