పోలవరం పనులకు బెలిజ్ ట్రక్లు
- September 21, 2016
భారీ బరువులను మోయ గలిగే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా పేరొందిన బెలాజ్ ట్రక్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకుంది. పోలవరం పనులు నిర్వహించేందుకు ఈ భారీ ట్రక్కును త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ కొనుగోలు చేసింది. 220 నుంచి 240 టన్నుల బరువును సునాయాసంగా మోయగలిగే ఇటువంటి ట్రక్కులు ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపిస్తాయి. ఉక్రేనియా సంస్థ బెలాజ్ కు చెందిన ఈ ట్రక్ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ట్రక్కుగా నిలిచింది. దీన్ని జాతీయ రహదారుల నిర్మాణం, మైనింగ్ లలో వినియోగించడంతోపాటు, భారీ వస్తువులను తరలించేందుకూ వాడతారు. 120 టన్నుల బరువును మోయగలిగే బెలాజ్ డంపర్ ను మహరాష్ట్ర వాడకంలోకి తేగా... 200 టన్నులకు పైగా బరువును మోయగలిగే స్థాయి కలిగిన ఈ బెలాజ్ ట్రక్ మాత్రం ఇండియాలోనే మొట్టమొదటిసారి వాడకంలోకి వచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









