మోదీ రోజంతా వార్ రూమ్లో ...
- September 21, 2016
ఉరీ దాడి నేపథ్యంలో.. పాక్తో 'కంటికి కన్ను పంటికి పన్ను' తరహాలో వ్యవహరించాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై ప్రధాని మోదీ బుధవారం రోజంతా వార్ రూమ్ (ఆర్మీ తాలూకూ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్)లో అత్యున్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. వార్రూమ్గా వ్యవహరించే ఈ అత్యంత రహస్యమైన కార్యాలయం నుంచే రక్షణ శాఖ అన్ని భద్రతాపరమైన అంశాలనూ పర్యవేక్షిస్తుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా.. ఆ రూమ్లోనే ఉన్న పీఎం బుధవారం నాడూ భద్రత వ్యవహారాలపై కేబినెట్ కమిటీతో అక్కడే రెండుసార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.ఉరీ దాడికి ఎలా స్పందించాలో కేంద్ర కేబినెట్లోని కీలక మంత్రులతో, ఆర్మీ చీఫ్తో కార్యాచరణపై చర్చించారు. మ్యాప్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సైకత నమూనాల ఆధారంగా మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఆయనకు పలు వివరాలు తెలియజేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







