జీవా, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'కవలై వేండాం'
- September 22, 2016
'రంగం' వంటి సూపర్హిట్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు జీవా నటిస్తున్న తాజా చిత్రం 'కవలై వేండాం'. ఇందులో కాజల్ నాయికగా నటిస్తోంది. 'యామిరుక్క బయమేన్' ఫేమ్ డీకే దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తమిళంలో భారీ వ్యయంతో తీస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులను డి.వి.
సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన భారీమొత్తం చెల్లించారు. డి.వెంకటేష్ మాట్లాడుతూ "రంగం' చిత్రం తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అందులో హీరోగా నటించిన జీవా, అగ్ర నాయిక కాజల్ కలిసి నటించిన చిత్రం అంటే అంచనాలు భారీగా ఉంటాయి.
ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. అంచనాలు పెంచింది. ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించాలనే ఉద్దేశంతో ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటిస్తాం.
మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. 'రంగం' చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా తమిళంలో తీయడం విశేషం అని చెప్పారు. జీవా, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శ్రుతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర పాత్రధారులు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







