హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ..
- September 22, 2016
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత భవనాలను ఖాళీ చేయించాలని అన్నారు. నాలాలకు ఇరువైపులా ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించాలని జనార్దన్రెడ్డి అధికారులకు సూచించారు. హుస్సేన్సాగర్లోకి భారీగా వరదనీరు పెరిగింది. లుంబిని పార్కులోకి వరదనీరు చేరింది. 15 ఏళ్ల తర్వాత పార్కులోకి వరదనీరు మళ్లీ వచ్చిందని, ఔట్ఫ్లో పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







