హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ..

- September 22, 2016 , by Maagulf
హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ..

నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత భవనాలను ఖాళీ చేయించాలని అన్నారు. నాలాలకు ఇరువైపులా ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించాలని జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు. హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు పెరిగింది. లుంబిని పార్కులోకి వరదనీరు చేరింది. 15 ఏళ్ల తర్వాత పార్కులోకి వరదనీరు మళ్లీ వచ్చిందని, ఔట్‌ఫ్లో పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com