జంట నగరాల్లో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు

- September 22, 2016 , by Maagulf
జంట నగరాల్లో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు

హైదరాబాద్‌ జంట నగరాల్లో విద్యా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. నగరంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. .

ఈ భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు కాలనీలు వరదనీటిలోనే చిక్కుకున్నాయి.

రహదారులన్నీ నీటితో నిండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు పార్కులను హెచ్‌ఎండీఏ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సంజీవయ్య, ఇందిరా, లుంబినీ పార్కుల్లోకి శనివారం వరకు సందర్శకులను అనుమతించేది లేదని హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com