వాట్సాప్కు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు
- September 23, 2016
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో ఖాతా డిలీట్ చేసే వారి సమాచారాన్ని, వివరాలను వాట్సాప్ తొలగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే వారి సమాచారాన్ని ఫేస్బుక్తో షేర్ చేసుకోవద్దని వాట్సాప్కు తెలిపింది. ఇటీవల వాట్సాప్ సమాచారాన్ని తన మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకునేందుకు అంగీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఈరోజు విచారించింది. డిలీట్ చేసిన ఖాతాల వివరాలను వాట్సాప్ కూడా తొలగించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పుచెప్పింది. వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్లను కూడా ట్రాయ్ కిందకు తీసుకురావాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.
కొత్త ప్రైవసీ పాలసీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ కారణంగా ఇతరులెవ్వరూ మెసేజ్లు చదవలేరని.. ఈ పిటిషన్పై బుధవారం జరిగిన విచారణలో వాట్సాప్ కోర్టుకు వెల్లడించింది. వాట్సాప్ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన తర్వాత కొద్దిరోజుల క్రితం వాట్సాప్ ప్రైవసీ పాలసీలో పెద్ద మార్పు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల అనుమతితో వారి ఖాతా సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకునే విధంగా పాలసీని మార్చింది.దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







