వాట్సాప్కు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు
- September 23, 2016
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో ఖాతా డిలీట్ చేసే వారి సమాచారాన్ని, వివరాలను వాట్సాప్ తొలగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే వారి సమాచారాన్ని ఫేస్బుక్తో షేర్ చేసుకోవద్దని వాట్సాప్కు తెలిపింది. ఇటీవల వాట్సాప్ సమాచారాన్ని తన మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకునేందుకు అంగీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఈరోజు విచారించింది. డిలీట్ చేసిన ఖాతాల వివరాలను వాట్సాప్ కూడా తొలగించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పుచెప్పింది. వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్లను కూడా ట్రాయ్ కిందకు తీసుకురావాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.
కొత్త ప్రైవసీ పాలసీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ కారణంగా ఇతరులెవ్వరూ మెసేజ్లు చదవలేరని.. ఈ పిటిషన్పై బుధవారం జరిగిన విచారణలో వాట్సాప్ కోర్టుకు వెల్లడించింది. వాట్సాప్ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన తర్వాత కొద్దిరోజుల క్రితం వాట్సాప్ ప్రైవసీ పాలసీలో పెద్ద మార్పు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల అనుమతితో వారి ఖాతా సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకునే విధంగా పాలసీని మార్చింది.దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









