తమిళనాడు వాసులకు ఉచిత వైఫై సేవలు ..
- September 23, 2016
తమిళనాడు వాసులకు ఉచిత వైఫై సేవలను అందించేందుకు ఏఐఏడీఎంకే ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో అమ్మ ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులో అమ్మ పేరుతో అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ మెడిసిన్, అమ్మ క్యాంటీన్తో పాటు పలు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత వైఫైని అందించేందుకు జయలలిత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బస్స్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, పార్కులు, పాఠశాలల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.తొలి దశలో భాగంగా 50 పాఠశాలల్లో రూ.10కోట్ల వ్యయంతో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







