తమిళనాడు వాసులకు ఉచిత వైఫై సేవలు ..
- September 23, 2016
తమిళనాడు వాసులకు ఉచిత వైఫై సేవలను అందించేందుకు ఏఐఏడీఎంకే ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో అమ్మ ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడులో అమ్మ పేరుతో అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ మెడిసిన్, అమ్మ క్యాంటీన్తో పాటు పలు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత వైఫైని అందించేందుకు జయలలిత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బస్స్టాండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, పార్కులు, పాఠశాలల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.తొలి దశలో భాగంగా 50 పాఠశాలల్లో రూ.10కోట్ల వ్యయంతో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









