వైభవంగా ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ ప్రారంభోత్సవం
- September 24, 2016
ప్రతిష్ఠాత్మక 'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్' రామోజీ ఫిల్మ్సిటీలో ఘనంగా ప్రారంభమైంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఇండీవుడ్ వేదిక రూపకర్త సోహన్ రాయ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వివిధ చిత్ర పరిశ్రమలను ఏకతాటిపైకి తేవడమే ఇండీవుడ్ కార్నివాల్ ఉద్దేశం. ఈ కార్నివాల్లో 80కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు జరిగే కార్నివాల్లో 132కిపైగా సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.
ఆర్ఎఫ్సీ వేదిక కావడం సంతోషం : రామోజీరావు
ఈ ప్రతిష్ఠాత్మక ఇండీవుడ్ కార్నివాల్కు రామోజీ ఫిల్మ్సిటీ వేదిక కావడం సంతోషంగా ఉందని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అన్నారు.
సినిమా రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేసేందుకు ఉపయోగపడే ఈ కార్నివాల్కు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సోహన్రాయ్ మానస పుత్రిక అయిన చారిత్రక ఇండీవుడ్ విజయవంతానికి అన్నివిధాలా సహకరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల్లో భాగంగా ఆయన చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందన్నారు.
సినిమాలు మన సంస్కృతి : సోహన్రాయ్
సినిమాలు మన సంస్కృతి అని ఇండీవుడ్ వేదిర రూపకర్త సోహన్రాయ్ అన్నారు. భారత చలనచిత్ర రంగం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను నడిపించగలదని పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమ అధునాతన సాంకేతికతను సంతరించుకుందని అన్నారు. చలనచిత్ర పరిశ్రమకు భారత ప్రభుత్వ సహకారం అవసరమని వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









