ప్రధాని మోడీ భద్రత బాధ్యత రాధాకృష్ణకు అప్పగింత
- September 24, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను సీనియర్ ఐపీఎస్ అధికారి రాధాకృష్ణ కినీకి అప్పగించారు. కేబినెట్ సెక్రటేరియట్లో సెక్యూరిటీ కార్యదర్శిగా రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో పనిచేసిన మలయ్ కుమార్ సిన్హా సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో రాధాకృష్ణ ఆ బాధ్యతలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1981 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన రాధాకృష్ణ.. ప్రస్తుతం నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరోలో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కు అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా భద్రతా కార్యదర్శి పనిచేస్తారు. ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు భారత్, విదేశాల్లో భద్రతా ఏర్పాట్లను వీరు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









