ప్రధాని మోడీ భద్రత బాధ్యత రాధాకృష్ణకు అప్పగింత
- September 24, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను సీనియర్ ఐపీఎస్ అధికారి రాధాకృష్ణ కినీకి అప్పగించారు. కేబినెట్ సెక్రటేరియట్లో సెక్యూరిటీ కార్యదర్శిగా రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో పనిచేసిన మలయ్ కుమార్ సిన్హా సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో రాధాకృష్ణ ఆ బాధ్యతలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1981 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన రాధాకృష్ణ.. ప్రస్తుతం నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరోలో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కు అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా భద్రతా కార్యదర్శి పనిచేస్తారు. ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు భారత్, విదేశాల్లో భద్రతా ఏర్పాట్లను వీరు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







