స్కూల్ బస్ ఫీజులపై పేరెంట్స్ ఫిర్యాదు
- September 26, 2016
జెడ్డా: జెడ్డాలో స్కూల్ బస్ ఫీజుల్ని 21.4 శాతం మేర పెంచారు. ఒక్కో విద్యార్థికీ 700 సౌదీ రియాల్స్ నుంచి 850 సౌదీ రియాల్స్ వరకూ ఫీజులు పెరిగాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఫీజుల పెంపు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారింది. అయితే వాహన ఇన్స్యూరెన్స్, ఉద్యోగుల జీతాలు వంటివాటి దృష్ట్యా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అబ్దుల్ రహమాన్ అల్ మోట్లాగ్ చెప్పారు. మరో ట్రాన్స్పోర్ట్ కంపెనీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ జహ్రి మాట్లాడుతూ, 15 నుంచి 20 శాతం మేర ఫీజులు పరిగినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాల కారణంగానే ఈ పెరుగుదల తప్పడంలేదని ఆయన వివరించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పెరిగిన స్కూల్ బస్ ఫీజుల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఫీజులతోనే తగిన ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







