'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల

- September 26, 2016 , by Maagulf
'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల

విశాల్‌ కథానాయకుడిగా నటించిన 'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల కానుంది. ఇందులో తమన్నా కథానాయికగా నటించారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు మిష్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ నటించడానికి అంగీకరించారు. 'తుప్పరివాలన్‌' పేరిట రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ చిత్రంలో ప్రసన్న ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. పూజా కార్యక్రమంలో విశాల్‌, వినయ్‌, ప్రసన్న, దర్శకుడు మిష్కిన్‌ తదితరులు పాల్గొన్నారు. తన సొంత బ్యానరైన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీపై దీనిని నిర్మిస్తున్నారు. అరోల్‌కరోలి ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.థ్రిల్లింగ్‌ కథాంశంతో 'తుప్పరివాలన్‌'ను రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com