పాక్పై ఆన్లైన్ పిటీషన్కు నెటిజన్లు మంచి స్పందన...
- September 27, 2016
పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ వుయ్ ద పీపుల్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో దాఖలు చేసిన ఓ పిటీషన్కు నెటిజన్లు స్పందించారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ పెట్టుబడిదారుగా వ్యవహిరిస్తోందంటూ ఈనెల 21న ఇండో-అమెరికన్ పౌరులు ఆన్లైన్లో పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఒబామా పరిశీలించాలంటే లక్ష సంతకాలు అవసరం. కాగా కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 82వేల మంది దీనికి మద్దతుగా సంతకాలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కారణంగా భారత్తో పాటు పలు దేశాలు శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ఉగ్రవాదంపై హౌస్ సబ్కమిటీ ఛైర్మన్ టెడ్పోయ్, మరో కాంగ్రెస్ సభ్యుడు డానా రోహర్బాచర్లు ప్రారంభించారు.త్వరలోనే ఈ పిటీషన్ను అమెరికన్ కాంగ్రెస్ పరిశీలనకు ఉంచనున్నారు.పాక్ ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు సరైన సమయం వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 21లోపు ఈ పిటీషన్ను వైట్హౌస్ వెబ్సైట్కు అందజేయాలి. గడువు తేదీ కంటే ముందే తమ లక్ష సంతకాల లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







