ధ్రువ రిలీజ్ వాయిదా పడింది..
- September 27, 2016
హీరో రాం చరణ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టారర్ ధ్రువ రిలీజ్ వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 7 న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగడం వల్ల దీన్ని వాయిదా వేస్తున్నామని, డిసెంబరు 2 న విడుదల అవుతుందని తాజాగా అనౌన్స్ చేశారు.
తమిళ మూవీ తని ఒరువన్ రీ-మేక్ అయిన ధ్రువ ఫస్ట్ లుక్ పోస్టర్ చెర్రీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చని ఆశించిన ఇతని ఫ్యాన్స్ ఇప్పుడు ఉసూరుమంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ వాయిదా పడడానికి రాం చరణ్ తన తండ్రి చిరు నటిస్తున్న ఖైదీ నెం.150 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







