ధ్రువ రిలీజ్ వాయిదా పడింది..
- September 27, 2016
హీరో రాం చరణ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టారర్ ధ్రువ రిలీజ్ వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 7 న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగడం వల్ల దీన్ని వాయిదా వేస్తున్నామని, డిసెంబరు 2 న విడుదల అవుతుందని తాజాగా అనౌన్స్ చేశారు.
తమిళ మూవీ తని ఒరువన్ రీ-మేక్ అయిన ధ్రువ ఫస్ట్ లుక్ పోస్టర్ చెర్రీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చని ఆశించిన ఇతని ఫ్యాన్స్ ఇప్పుడు ఉసూరుమంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ వాయిదా పడడానికి రాం చరణ్ తన తండ్రి చిరు నటిస్తున్న ఖైదీ నెం.150 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









