స్మార్ట్‌ ఫోన్‌ నుంచే ఎన్‌ఓల్‌ కార్డ్‌ రీచార్జ్‌

- September 27, 2016 , by Maagulf
స్మార్ట్‌ ఫోన్‌ నుంచే ఎన్‌ఓల్‌ కార్డ్‌ రీచార్జ్‌

దుబాయ్‌: దుబాయ్‌లో ఎన్‌ఓఎల్‌ కార్డుదారులకు శుభవార్త. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) అతి త్వరలో ఎన్‌ఓఎల్‌ కార్డుల్ని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఆర్‌టిఎ దీనికి సంబంధించి ఫైనల్‌ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసే పనిలో ఉంది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాప్‌కి ఈ కొత్త విధానాన్ని అనుసంధానం చేస్తారు. అప్‌గ్రెడేషన్‌ పూర్తయ్యాక ఆ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకునేవారికి ప్రస్తుతం అందే సర్వీసులతోపాటు, కొత్త సర్వీసులు కూడా అందుతాయి. అప్‌గ్రేడెడ్‌ యాప్‌ 'నియర్‌ ఫీల్డ్‌ కనెక్టివిటీ (ఎన్‌ఎఫ్‌సి) ద్వారా పనిచేస్తుంది. ఈ కొత్త అప్‌గ్రేడెడ్‌ యాప్‌ ద్వారా ఎన్‌ఓఎల్‌ కార్డుల్ని స్మార్ట్‌ ఫోన్‌ నుంచే అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. రీచార్జింగ్‌ మెషీన్లతో తలెత్తుతున్న ఇబ్బందులకు కొత్త విధానం ఎంతో ఉపశమనం కల్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. దుబాయ్‌ స్మార్ట్‌ సిటీ ఇనీషియేటివ్‌లో భాగంగా పలు సేవల్ని వినియోగదారులకు మరింత సులువుగా అందించేందుకు సరికొత్త ఆవిష్కరణల చోటుచేసుకుంటున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com