నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత షిమన్‌ ప్యారెస్‌ కన్నుమూశారు

- September 27, 2016 , by Maagulf
నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత షిమన్‌ ప్యారెస్‌ కన్నుమూశారు

 ఇజ్రాయిల్‌ మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత షిమన్‌ ప్యారెస్‌(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు షిమన్‌ వ్యక్తిగత వైద్యుడు రఫీ వాల్డెన్‌ వెల్లడించారు. రెండు వారాల క్రితం గుండెపోటు రావడంతో ప్యారెస్‌ను తెల్‌ అవివ్‌లోని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
దాదాపు 7 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1959లో తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తర్వాత ఇజ్రాయిల్‌లోని అన్ని ప్రముఖ కార్యాలయాల్లో పనిచేశారు.
రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ప్యారెస్‌ .. 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఇజ్రాయిల్‌-పాలస్తీనా శాంతి కోసం కీలకంగా పనిచేశారు. ఇందుకుగానూ..1994లో నోబెల్‌ శాంతి బహుమతి కూడా అందుకున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com