నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమన్ ప్యారెస్ కన్నుమూశారు
- September 27, 2016
ఇజ్రాయిల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమన్ ప్యారెస్(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు షిమన్ వ్యక్తిగత వైద్యుడు రఫీ వాల్డెన్ వెల్లడించారు. రెండు వారాల క్రితం గుండెపోటు రావడంతో ప్యారెస్ను తెల్ అవివ్లోని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
దాదాపు 7 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1959లో తొలిసారిగా పార్లమెంట్కు ఎన్నికయ్యారు. తర్వాత ఇజ్రాయిల్లోని అన్ని ప్రముఖ కార్యాలయాల్లో పనిచేశారు.
రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ప్యారెస్ .. 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా శాంతి కోసం కీలకంగా పనిచేశారు. ఇందుకుగానూ..1994లో నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







